జూబ్లీహిల్స్లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు
11/30/2020
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ బూతులకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు వేశారు. ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు వేశారు. అలాగే నాంపల్లిలో సీపీ సజ్జనార్, కుందన్బాగ్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎఫ్ఎన్సీసీలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు